click here for more news about Nara Lokesh
Reporter: Divya Vani | localandhra.news
Nara Lokesh భారత రాజకీయాల్లో కాలానుగుణ మార్పులు అవసరం.ప్రజల అవసరాలు, ఆలోచనలు మారుతున్నాయి.ఈ మార్పులకు అనుగుణంగా పార్టీ విధానాలు కూడా సవరించాలి.ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి (Nara Lokesh) ఆరు ముఖ్యమైన ధర్మసూత్రాలను ప్రతిపాదించారు.ఈ సూత్రాలు పార్టీ విధానాలను, దిశను నిర్దేశిస్తాయి.

- తెలుగుజాతి విశ్వఖ్యాతి:తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగువారికి గౌరవం, గుర్తింపు లభించింది.అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది.ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగువారిని ప్రపంచ పటంలో నిలిపేందుకు కృషి చేయాలి.
- యువగళం:తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేస్తోంది.సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తూ, పనిచేసేవారిని ప్రోత్సహిస్తోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో, యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశం.
- స్త్రీ శక్తి:అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహిళలను అవమానించారు. రానున్న రోజుల్లో మహిళలను మరింత బలోపేతం చేయడం, సమాన బాధ్యతలు, భద్రత కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి.
- పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్:పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్.చాలీచాలని పెన్షన్ 5 రెట్లు పెంచి 200 నుంచి 1000 రూపాయలు చేసింది, వెయ్యి నుంచి 2వేలు చేసింది మన చంద్రబాబు గారు.ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- అన్నదాతకు అండగా:రైతు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. చేయూతనందిస్తే మన రైతులు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలుచేయాలి.
- కార్యకర్తే అధినేత:ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్పూర్తి. ఆనాడు పుంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత తొడగొట్టి మీసాలు మెలేసి నామినేషన్ వేసి చూపించారు. ప్రత్యర్థుల దాడిలో రక్తం కారుతున్న భయపడకుండా బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువ. నడివీధిలో కత్తి గొంతుపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పమంటే… జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కుటుంబసభ్యులు మనకి ఉన్నారు. కార్యకర్తలను ఆదుకోవడానికి, వారు సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Conclusion:నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు ధర్మసూత్రాలు తెలుగుదేశం పార్టీకి కొత్త దిశా నిర్దేశం. ఈ సూత్రాలు పార్టీ విధానాలను, దిశను నిర్దేశిస్తాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడం, సమాజంలో సమానత్వం, న్యాయం, అభివృద్ధి సాధించడం ఈ సూత్రాల ప్రధాన లక్ష్యాలు.ఈ మార్పులతో తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను పొందగలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేలా ఈ సూత్రాలు అమలవుతాయి.