click here for more news about Hyderabad
Reporter: Divya Vani | localandhra.news
Hyderabad నగరం డ్రగ్స్ ముఠాల జోలికి పోతుందా? పబ్ల పేరుతో మద్యం, మ్యూజిక్ ఆడుతూనే పక్కనే మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుందా? ఇటీవలి పోలీస్ దాడులతో ఈ అనుమానాలకు బలమొస్తోంది.సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. పబ్లలో జరుగుతున్న మత్తు గుట్టును రట్టు చేస్తూ ఆకస్మిక దాడులతో (Hyderabad) పలువురిని అరెస్ట్ చేసింది.శుక్రవారం రాత్రి గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లపై సైబరాబాద్ ఎస్ఓటీ బృందాలు దాడులు చేపట్టాయి.

ముందస్తు సమాచారం ఆధారంగా నగరంలోని ప్రముఖ నైట్లైఫ్ హాట్స్పాట్లలో ఈ దాడులు నిర్వహించాయి.ముఖ్యంగా ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లోని క్లబ్ రఫ్, అలాగే ఫ్రాట్ హౌస్ పబ్లు అధికారులు టార్గెట్ చేశారు.ఈ పబ్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తించారు.మ్యూజిక్, డాన్సింగ్ పేరుతో పబ్లలో యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్టు సమాచారం అందిన నేపథ్యంలో దాడులకు దిగారు.క్లబ్ రఫ్ పబ్లో పోలీసులు హఠాత్తుగా ప్రవేశించి, అక్కడున్న యువకులకు డ్రగ్ టెస్ట్లు నిర్వహించారు.ఈ పరీక్షల్లో నలుగురు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యింది.అరెస్ట్ అయిన వారిలో డీజే ప్లేయర్ శివ కూడా ఉండటం పోలీసులకు షాక్ ఇచ్చింది.డ్రగ్స్కి ఎంటర్టైన్మెంట్ ప్రపంచం కూడా అతుక్కుంటుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం వీరి వద్ద విచారణ కొనసాగుతోంది.పట్టుబడినవారికి డ్రగ్స్ ఎలా సరఫరా అయ్యాయి? వీరిలో మరెవెవరు ఈ మత్తు ముఠాల్లో భాగమై ఉన్నారు? వీరి వెనకున్న నెట్వర్క్ ఎవరిది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చిట్టచివరి వినియోగదారులను అరెస్ట్ చేయడమే కాకుండా, పైనుంచి దిగుతున్న సప్లయ్ ఛైన్ను కూడా పోలీసులు ఛేదించాలని యత్నిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు – నగరంలోని పబ్లు, బార్ల యాజమాన్యాలు తాము నిర్వహించే ప్రాంగణాలను డ్రగ్-ఫ్రీ జోన్లుగా ప్రకటించాలి. మైనర్లకు మద్యం విక్రయించకూడదు.
ఎటువంటి మత్తు పదార్థాలను అనుమతించరాదని స్పష్టంగా చెప్పారు.ఇలాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా చేయాలంటే పబ్ యాజమాన్యాలే ముందుకు రావాలని కోరారు.అంతేకాకుండా, అనుమానిత కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు నిబద్ధతతో సమాచారం అందించాలని, తమ వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.సైబరాబాద్ పోలీసుల ఎస్ఓటీ బృందాలు మాదకద్రవ్యాల పై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పబ్లు, పార్టీలలో డ్రగ్స్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి శుక్రవారం, శనివారం రాత్రుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్లో పబ్ కల్చర్ విస్తరిస్తున్న కొద్దీ డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నైట్లైఫ్ బాగా ఉత్సాహంగా మారుతోంది. కానీ అదే సమయంలో, మత్తు మాఫియా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల దాడులు సరిగ్గా అవసరమైన సమయంలో జరిగాయి.
డీజే ప్లేయర్ శివ వంటి యువకులు డ్రగ్స్ మాయలో చిక్కుకుంటుండటం నిజంగా బాధాకరం. పేరున్న మ్యూజిక్ ప్రొఫెషనల్స్ కూడా మత్తు పదార్థాలపై ఆసక్తి చూపడం, అందరికి తలపోసే విషయమే. యువత ఇవి తాకితే కెరీర్దే కాదు, జీవితమే అంధకారంలోకి జారిపోతుంది. పోలీసులు చేసిన హెచ్చరికలు కేవలం పబ్ యాజమాన్యాలకే కాకుండా, ప్రతి యువకుడికీ వార్నింగ్గా ఉండాలి.ఇలాంటి కేసులు లొకల్ వాడకుల వరకే ఆగిపోవు. వీటికి వెనక ఓ పెద్ద రాకెట్ ఉంటుందని పోలీసుల అనుమానం. రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎవరెవరు తీసుకొస్తున్నారు? ఎక్కడెక్కడ నిల్వ చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. డ్రగ్ సప్లయర్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నది పోలీసుల భావన.