click here for more news about DRDO
Reporter: Divya Vani | localandhra.news
DRDO పశ్చిమ సరిహద్దుల్లో పాక్ తరచూ డ్రోన్ల ద్వారా చొరబాటు ప్రయత్నాలు చేస్తోంది.కానీ ఇప్పుడు, భారత్ ఈ ముప్పుకు సమాధానం ఇచ్చింది. DRDO అభివృద్ధి చేసిన ‘డ్రోన్ డిటెక్ట్, డెటర్ అండ్ డిస్ట్రాయ్’ (D4) వ్యవస్థతో ఈ ముప్పును సమర్థంగా అడ్డుకుంటోంది.ఈ సాంకేతికత, ఇజ్రాయెల్కి చెందిన ‘ఐరన్ డోమ్’కి పోటీగా నిలుస్తోంది.టర్కీ తయారు చేసిన డ్రోన్లను కూడా ఈ వ్యవస్థ సులభంగా నిర్వీర్యం చేస్తోంది.పాక్ వినియోగించే డ్రోన్లపై ఇది ఇప్పటివరకూ మంచి విజయాలు సాధించింది.ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేయడంలో DRDO నాలుగు ముఖ్య ప్రయోగశాలలను కలిపింది.వీటన్నీ మల్టీ-సెన్సార్ టెక్నాలజీపై పనిచేశాయి.లక్ష్యం ఏంటంటే — డ్రోన్లను గుర్తించటం, వర్గీకరించటం, తర్వాత నిర్వీర్యం చేయటం.ఈ వ్యవస్థ ఇప్పటికే భారత త్రివిధ దళాల్లో ప్రవేశించిపోయింది.

అంటే సైనిక అవసరాలకు ఇది పూర్తిగా సిద్ధంగా ఉంది.పాక్ డ్రోన్లు ఎక్కువగా తక్కువ ఖర్చుతో గుంపులుగా వచ్చి దాడి చేస్తాయి. ఇవి భారత రక్షణ వ్యవస్థలను తలకిందులే చేసే ఉద్దేశంతో పంపబడతాయి.అయితే, D4 వ్యవస్థలోని టెక్నాలజీతో ఇవి అంత సులభంగా పనిచేయవు.D4 ప్రధానంగా రెండు దశల్లో పని చేస్తుంది —సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్,సాఫ్ట్ కిల్ పద్ధతిలో, డ్రోన్ల కమ్యూనికేషన్ను జామ్ చేస్తారు.దీనికోసం RF జామింగ్, GPS స్పూఫింగ్, GNSS జామింగ్ వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తారు. డ్రోన్లు ఎక్కువగా GPSపై ఆధారపడతాయి.వాటిని తప్పుదారి పట్టించి గాలిలోనే నిర్వీర్యం చేస్తారు.హార్డ్ కిల్ దశ అవసరం వచ్చినప్పుడు, లేజర్ ఆయుధాల వాడకం ద్వారా డ్రోన్లను నాశనం చేస్తారు. ఇది చివరి దశలో జరుగుతుంది.
హైదరాబాద్లోని CHESS (Center for High Energy Systems and Sciences) దీనికి కీలకంగా పనిచేసింది.D4 వ్యవస్థను వాహనాలపై అమర్చవచ్చు లేదా స్థిరంగా కూడా ఏర్పాటు చేయొచ్చు. స్థిర యూనిట్లు 360 డిగ్రీల కవరేజీ కలిగి ఉంటాయి. ఇవి చిన్న డ్రోన్లను కూడా చాకచక్యంగా కూల్చేయగలవు. వాహన ఆధారిత సిస్టమ్స్ యుద్ధ ప్రాంతాల్లో చురుకుగా వినియోగిస్తున్నారు.D4 వ్యవస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)తో పాటు అనేక దేశీయ సంస్థలు దీని తయారీలో భాగమయ్యాయి. దేశంలోని భద్రతా విభాగాలన్నీ ఈ టెక్నాలజీని సమర్థించాయి. అంతేకాకుండా, విదేశీ దేశాల రక్షణ సంస్థల ముందు కూడా దీన్ని ప్రదర్శించారు.