click here for more news about Covid Cases
Reporter: Divya Vani | localandhra.news
Covid Cases దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా కేసులు నమోదవుతుండటం ఊహించని పరిస్థితిని కలిగిస్తోంది.గత నాలుగు రోజులలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండింతలు పెరగడం శోకకరం.కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు ఉండగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి పెరిగింది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 1,700 పైగా కొత్త కేసులు వచ్చాయి. ఇది (Covid Cases) మళ్లీ వేగంగా విస్తరిస్తోందని స్పష్టం చేస్తోంది.ఈసారి మళ్లీ కేరళే ముందంజలో ఉంది.అక్కడ మొత్తం 1,147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది దేశంలో అత్యధికం.

కేరళలో ప్రతిరోజూ కొత్త కేసులు రావడం కొనసాగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.మహారాష్ట్రలో 424 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 294 కేసులున్నాయి.రెండు రాష్ట్రాల్లోనూ జనం తగిన జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది.ఇక గుజరాత్లో ప్రస్తుతం 223 యాక్టివ్ కేసులు ఉన్నాయి.తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కోటి 148 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.పశ్చిమ బెంగాల్లో 116 మంది కరోనా బాధితులు ఉన్నారు.ఇవన్నీ చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో కొవిడ్ మళ్లీ పట్టుకున్నట్టు అనిపిస్తోంది.రాజస్థాన్లో 51, ఉత్తరప్రదేశ్లో 42 యాక్టివ్ కేసులు ఉన్నాయి.పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 మంది కొవిడ్తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 16, తెలంగాణలో కేవలం 3 యాక్టివ్ కేసులే ఉన్నాయి.ఇది కొంత ఊరటనిచ్చే విషయం.మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో తలా 4 చొప్పున కేసులు ఉన్నట్టు అధికారులు చెప్పారు.అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్లలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. మిజోరాం, అసోంలలో రెండేసి కేసులు ఉన్నాయి.అండమాన్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్లలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసూ లేదు. ఈ రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ నెలలో ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే.
వారు ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వివరించారు.ఇతర రాష్ట్రాల మృతులతో పోలిస్తే, పంజాబ్లో మరణించిన వ్యక్తి యువకుడు కావడం గమనార్హం. అయితే అతనికి ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నా, వేగంగా పెరుగుతున్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మళ్లీ ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. టీకా తీసుకున్నవారిలో సైతం కొందరికి మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. పాత మాదిరిగా కరోనా కంట్రోల్ రూంలు సిద్ధంగా ఉంచాలని సూచించింది. ప్రయాణించే వారికి టెస్టులు తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు.
కొవిడ్ కేసులు మళ్లీ పెరగడం వెనుక కొత్త వేరియంట్ ఉందనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇంకా అధికారికంగా దీనిపై పూర్తి సమాచారం లేదు. కొత్త వేరియంట్ ప్రబలితే మళ్లీ పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంది.ప్రస్తుతం రోజుకు కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. ల్యాబ్లు తిరిగి యాక్టివ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఏ చిన్న లక్షణమైనా ఉండగానే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.ప్రస్తుతం లాక్డౌన్పై కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటనలేదు. కానీ, పరిస్థితి చేజారితే కొన్ని ప్రాంతాల్లో మినీ లాక్డౌన్లు ఉండే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే అది తప్పించుకోగలం.కరోనా తగ్గినట్టే అనుకున్నాం. కానీ అది పూర్తిగా పోయింది కాదు.