click here for more news about Tamannaah Bhatia
Reporter: Divya Vani | localandhra.news
Tamannaah Bhatia కర్ణాటకలో శతాబ్ద కాలంగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన బ్రాండ్ – మైసూర్ శాండల్ సబ్బు. ఈ సబ్బును కొత్త తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బాలీవుడ్ నటి త(Tamannaah Bhatia)ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. కానీ ఈ నిర్ణయం ఊహించని రీతిలో ప్రాంతీయ గర్వం, సాంస్కృతిక ప్రతినిధ్యం అనే అంశాల చుట్టూ పెద్ద చర్చను రేపింది.1916లో నాటి మైసూరు మహారాజు కృష్ణరాజ వోడయార్ ప్రారంభించిన ఈ సబ్బు కర్ణాటక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి సాండల్ సబ్బు ఇదే. 100 ఏళ్లకు పైగా చరిత్ర, పసందైన అత్తర్ సువాసన, నేచురల్ డియెంట్స్ –ఇవన్నీ ఈ బ్రాండ్ను ప్రత్యేకం చేశాయి.కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) సంచలన నిర్ణయం తీసుకుంది. మైసూర్ శాండల్ సబ్బు ప్రచారానికి తమన్నాను ఎంపిక చేసి, రెండు సంవత్సరాల కాంట్రాక్టు కింద ₹6.2 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.అయితే బాలీవుడ్ నటిని ఎంపిక చేయడం కన్నడ ప్రజలకు నచ్చలేదు.

“మైసూర్ బ్రాండ్కు ముంబై ముఖం ఎందుకు?” అనే ప్రశ్నతో స్థానిక సంఘాలు, ప్రతిపక్షాలు, కార్యకర్తలు మండిపడ్డారు.కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. “ఇది నైతికతకు వ్యతిరేకం, ప్రాంతీయ గౌరవానికి అవమానం,” అని లేఖలో పేర్కొన్నారు.మైసూర్ శాండల్ సబ్బు కర్ణాటక సాంస్కృతిక గుర్తింపుగా ఎదిగిందని, దీన్ని ప్రచారం చేయడానికి కన్నడ నటి అయితే బాగుండేదన్నారు. తమన్నా ఎంపిక కన్నడ కళాకారులను తక్కువ చేసి చూపినట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.వివాదం పెరుగుతున్న వేళ కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ వివరణ ఇచ్చారు. “మేము మార్కెటింగ్ నిపుణులతో చర్చించి, జాతీయ స్థాయిలో బ్రాండ్ వృద్ధి దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నాం”అని చెప్పారు.ఆమెకు 2.8 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.తక్కువ ఖర్చులో అధిక వ్యాప్తి సాధించవచ్చు.దీపికా, రష్మిక, పూజా హెగ్డే, కియారా వంటి పేర్లు పరిశీలించినా, తమన్నా సరైన ఎంపికగా భావించామన్నారు.ప్రాంతీయ బ్రాండ్కి జాతీయ ముఖం అవసరమా?ఒకవైపు బ్రాండ్ గుర్తింపు పెంచాలంటే జాతీయ స్థాయి సెలబ్రిటీల అవసరం ఉంది. మరోవైపు ప్రాంతీయ గర్వం, స్థానిక ప్రతినిధ్యం కూడా తక్కువేమీ కాదు.బ్రాండ్ విలువలో భాగమైన ‘స్థానికత’ పునాది దెబ్బతింటుందా? అనే అనుమానం ప్రజల్లో ఉంది.విమర్శకుల మాటల్లో వాస్తవం ఉంది. కన్నడ పరిశ్రమలో అనేక మంది ప్రతిభావంతులున్నారు.
వారిని ఎంపిక చేసి ప్రచారం చేస్తే, ప్రజల్లో అప్రతిభాయుతంగా కనెక్ట్ అవుతారు. దీనివల్ల స్థానికంగా ఆదరణ పెరుగుతుంది, నటులకూ ప్రోత్సాహం లభిస్తుంది.రెండు సంవత్సరాల కాంట్రాక్టుకు 6.2 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించనుంది. ఇది చాలా పెద్ద మొత్తం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన KSDL ఖర్చును న్యాయంగా భావించాలంటే, ఆ డబ్బుతో వచ్చే వృద్ధి స్పష్టంగా చూపించాలి.అంటే ప్రచారం వల్ల విక్రయాలు పెరిగాయా? బ్రాండ్ గుర్తింపు పెరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి.తమన్నా ఎంపికపై నెటిజన్లలో వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొంత మంది – “బ్రాండ్ను దేశవ్యాప్తంగా గుర్తించాలి” అంటున్నారు.
మరికొంత మంది – “కన్నడ అభిమానం మర్చిపోవద్దు” అని రిప్లై ఇస్తున్నారు.ఇది ఆన్లైన్లో హాట్ టాపిక్ అయింది.ఈ వివాదానికి సమతుల్య పరిష్కారం దొరకాలి. ఒకవేళ తమన్నా జాతీయ ప్రచారానికి ఉంటే, స్థానికంగా కూడా కనీసం ఒక కన్నడ నటితో ప్రచారం జరిపితే బ్యాలెన్స్ కుదిరేది. ఇలా చేస్తే ప్రతిష్టను బజారుగా మార్చకుండా, బ్రాండ్ గౌరవాన్ని నిలబెట్టుకోవచ్చు.మైసూర్ శాండల్ సబ్బు కేవలం ఒక సబ్బు కాదు. అది కర్ణాటక గర్వానికి చిహ్నం. ఈ బ్రాండ్ను ప్రపంచానికి పరిచయం చేయాలి. కానీ అదే సమయంలో, స్థానిక ప్రజల మనసులు గెలవడమూ అవసరం. తమన్నా ఎంపిక ఎంతవరకు ఫలితాలిస్తుందో చూడాలి.