click here for more news about Jayam Ravi
Reporter: Divya Vani | localandhra.news
Jayam Ravi ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.ఆయన భార్య ఆర్తితో విడాకుల వివాదం ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు దృష్టిలో ఉంది.ఈ కేసు తాజాగా కోర్టులో విచారణకు రాగా, కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.Jayam Ravi మరియు ఆర్తి ఇద్దరూ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు.విచారణ సందర్భంగా ఆర్తి, విడాకుల కోసం భర్త జయం రవి నుండి నెలకు రూ.40 లక్షల భరణం కోరుతూ పిటిషన్ వేశారు.ఇది చర్చకు కేంద్ర బిందువైంది.ఇద్దరి మధ్య సర్దుబాటు జరగాలన్న ఉద్దేశంతో కోర్టు, వారిని కౌన్సెలింగ్కు పంపించాలని సూచించింది.కానీ జయం రవి స్పష్టంగా మాట్లాడుతూ, ఆర్తితో సంబంధం కొనసాగించలేనని చెప్పినట్టు సమాచారం.దీంతో, ఆయన తరఫు న్యాయవాదులు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.ఇదే కేసులో మరిన్ని వివరాలు, వాదనలు రానున్న అవకాశముంది.గత ఏడాది జయం రవి విడాకుల విషయాన్ని ప్రకటించారు.అయితే, దీనిపై ఆర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.తనను ముందుగా సంప్రదించకుండా మీడియాతో పంచుకున్నారని ఆరోపించారు. ఇది నన్ను దెబ్బతీసింది, అని ఆమె చెప్పారు.జయం రవి – గాయని కెనీషా మధ్య ఉన్న స్నేహం కారణంగానే, రవి – ఆర్తి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని కోలీవుడ్ వర్గాల్లో చర్చ. ఇద్దరూ ఇటీవల ఒక కార్యక్రమానికి కలిసి రావడం ఈ వార్తలకు మద్దతుగా మారింది.18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోవడం చిన్న విషయం కాదు. ఆర్తి తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
పిల్లల భవిష్యత్తు కోసమే నేను పోరాడుతున్నా, అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఆమె మాటల్లో బాధ, బాధ్యత రెండూ స్పష్టంగా కనిపించాయి.ఆర్తి ఆరోపణలకు జయం రవి కూడా జవాబు చెప్పారు. ఆమె మానసికంగా, ఆర్థికంగా నన్ను నియంత్రించేందుకు చూస్తున్నారు,’’ అని పేర్కొన్నారు. విడాకుల వెనుక ఉన్న పరిస్థితులు ఇదే కాదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎదురవుతున్నాయి.నిన్న ఒక పోస్ట్లో ఆర్తి మరో సర్ప్రైజ్ ఇచ్చారు.విడాకులకు మూడో వ్యక్తే కారణం.నా వద్ద దానికి ఆధారాలున్నాయి,అంటూ పరోక్షంగా కెనీషాని లక్ష్యంగా చేసిందనే ఊహలు చెలామణీ అయ్యాయి.ఆమె తాజా వ్యాఖ్యలు చూస్తే, ఇకనుంచి సోషల్ మీడియా ద్వారా మాట్లాడదనిపిస్తుంది. ‘‘న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.
ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం అక్కడే లభిస్తుంది, అని తెలిపింది.ఇద్దరి ఆరోపణలు, సమాధానాలు, సోషల్ మీడియా పోస్ట్లు — ఇవన్నీ కలిపి ఈ వ్యవహారాన్ని పబ్లిక్ డ్రామాగా మార్చేశాయి. అభిమానులు మాత్రం ఒకటే అంటున్నారు – పిల్లల కోసం శాంతియుతంగా పరిష్కారం రావాలి.ఈ విషయం ఇప్పుడు టీవీ చానెల్స్, న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియా అన్నింటిలోనూ టాపిక్ ఆఫ్ ది డేగా మారింది. జయం రవి కెరీర్పై ఈ వివాదం ప్రభావం చూపుతుందా? ఆర్తి భరణం డిమాండ్కి కోర్టు స్పందన ఏమిటి? అన్నదానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.