Operation Sindhur : ‘ఆపరేషన్ సిందూర్’ ఘన విజయం..

Operation Sindhur : ‘ఆపరేషన్ సిందూర్’ ఘన విజయం..

click here for more news about Operation Sindhur

Reporter: Divya Vani | localandhra.news

Operation Sindhur భారత రక్షణ రంగంలో ఇటీవల జరిగిన ‘Operation Sindhur’ విజయంతో దేశీయంగా తయారైన ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ విజయంతో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సరిహద్దులు దాటకుండానే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సేకరణ కోసం రక్షణ రంగానికి అదనంగా రూ. 50,000 కోట్లు కేటాయించే ప్రతిపాదన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అదనపు కేటాయింపులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే అవకాశాలున్నాయని సమాచారం. ఈ అదనపు నిధులతో సాయుధ బలగాల అవసరాలు తీర్చడం, కీలకమైన కొనుగోళ్లు చేపట్టడం, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది.

Operation Sindhur : ‘ఆపరేషన్ సిందూర్’ ఘన విజయం..
Operation Sindhur : ‘ఆపరేషన్ సిందూర్’ ఘన విజయం..

2014-15లో రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 6.81 లక్షల కోట్లకు చేరుకుంది.ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53 శాతం అధికం కావడం గమనార్హం.ప్రస్తుత కేటాయింపులు మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతం వాటాను కలిగి ఉన్నాయి.’ఆపరేషన్ సిందూర్’ దేశీయంగా తయారైన ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 12న తన ప్రసంగంలో ప్రశంసించారు.ఈ ఆపరేషన్ సమయంలో, మన ‘మేడిన్ ఇండియా’ ఆయుధాల విశ్వసనీయత దృఢంగా స్థిరపడింది.21వ శతాబ్దపు యుద్ధ తంత్రంలో ‘మేడిన్ ఇండియా’ రక్షణ పరికరాల సమయం ఆసన్నమైందని ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది”అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ విజయం దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.గత పదేళ్లలో దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపు పైనే ఉందని ప్రధాని మోదీ తెలిపారు.వాటిలు విలువ రూ.లక్ష కోట్లు దాటేసిందని ఆయన పేర్కొన్నారు.ఈ విజయ సాధనలో యువతదే కీలక పాత్రగా పేర్కొన్నారు.రక్షణ రంగంలో 150కిపైగా స్టార్ట్‌పలు ఏర్పాటయ్యాయని, సాయుధ బలగాలు రూ.1,800 కోట్ల విలువైన ఆర్డర్లు వాటికిచ్చి చేయూతనిస్తున్నాయని ఆయన తెలిపారు.రక్షణ రంగంలో స్వావలంబన త్రివిధ బలగాల్లో విశ్వాసం నింపుతుందన్నారు.రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ‘భారత్ శక్తి’ విన్యాసాలు నిర్వహించబడ్డాయి.

ఈ విన్యాసాల్లో మొదటిసారి పూర్తిస్థాయిలో స్వదేశీ తయారీ ఆయుధ సంపత్తి, యుద్ధవిమానాలు, క్షిపణులను ప్రయోగించారు.టీ-90 (ఐఎం) యుద్ధట్యాంకులు, కే-9 వజ్ర, ధనుష్‌, సారంగ్‌ ఆర్టిలరీ గన్‌ వ్యవస్థలు, ఆకాశ్‌ ఆయుధ వ్యవస్థ, పినాక శాటిలైట్‌ సిస్టమ్‌, లాజిస్టిక్స్‌ డ్రోన్లు, రోబోటిక్‌ మూల్స్‌, ఏఎల్‌హెచ్‌, మానవ రహిత ఏరియల్‌ వాహనాలను వినియోగించారు.భారత నౌకాదళం నౌకావిధ్వంసక క్షిపణులు, అటానమస్‌ కార్గో ఏరియల్‌ వాహనాలను, గగనతల లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది.వైమానిక దళం తేలికపాటి తేజస్‌ యుద్ధవిమానాలు, లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్లు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లను ప్రదర్శించింది.ఈ విన్యాసాలు భారత యుద్ధసన్నద్ధతను చాటడం, సమకాలీన, భావి సవాళ్లను స్వదేశీ పరిష్కారాలతో అధిగమించడం, భారత స్వదేశీ రక్షణ సామర్థ్యం, నైపుణ్యాలు, నవీన ఆవిష్కరణలను ప్రపంచానికి చూపడం ఈ విన్యాసాల పరమార్థమని రక్షణశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Start your housing disrepair claim now. Terry g’s retirement, other top entertainment news last week – premium times nigeria. The resilient roar : unraveling the dynamics of india’s kisaan andolan.