click here for more news about UK Visa
Reporter: Divya Vani | localandhra.news
UK Visa పాకిస్థానీ పౌరులకు బ్రిటన్ ఒక షాక్ ఇచ్చింది ఆసైలం దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో వీసా నిబంధనలు గట్టిగా మార్చింది. ఇది ఒక్క పాకిస్థాన్కే కాకుండా, నైజీరియా, శ్రీలంక పౌరులపై కూడా ప్రభావం చూపుతుంది.చదువు, ఉద్యోగం కోసం బ్రిటన్ వెళ్లిన వారు అక్కడే స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు.వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా మిగిలిపోతున్నారు.

ఆపై ఆసైలం కోసం దరఖాస్తులు పెరిగిపోతున్నాయి.ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.2024లో ఆసైలం కోసం మొత్తం 1,08,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,542 మంది పాకిస్థానీ పౌరులే.అంటే ప్రతి 10 మందిలో ఒక్కరు పాకిస్థానీనే అన్నమాట. బ్రిటన్కు ఇది ఊహించని భారం అయింది.ఇప్పుడు వీసా ఇస్తే, వారు తిరిగి పోవాలన్న నిబంధనకే అడ్డుగొడుతున్నారు.అందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఇప్పుడు దరఖాస్తుదారులపై ప్రొఫైలింగ్ చేస్తారు.ఆసైలం దరఖాస్తు చేసే అవకాశం ఉందా? అన్నదాన్ని ముందే అంచనా వేస్తారు.ఎవరైనా రిస్క్గా కనిపిస్తే వారి వీసా అప్లికేషన్ను నో అంటారు.అంతే కాదు ఆర్థికంగా స్వతంత్రత లేకపోతే కూడా వీసా ఇవ్వరు. ప్రభుత్వ పన్నులపై ఆధారపడే వారి కోసం వసతులు ఇకపై ఉండవు.2024లో బ్రిటన్ ప్రభుత్వం స్టూడెంట్లు, కేర్ వర్కర్లకు డిపెండెంట్లను తీసుకురావడంపై నిషేధం వేసింది. దీంతో ఒక్క ఏడాదిలోనే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గిపోయాయి. ఇది ప్రభుత్వానికి ఒక విజయంగా కనిపిస్తుంది.ఇప్పుడు బ్రిటన్ ఫోకస్, స్టడీ వీసాలపై. ఎందుకంటే చాలా మంది విద్యార్ధులు చదువు పేరుతో వచ్చి, ఆ తర్వాత ఆసైలం దరఖాస్తు చేస్తున్నారు. అదే విధంగా వర్క్ వీసాలతో వచ్చేవాళ్ల దగ్గర నుంచి కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.వీసా ఇవ్వాలంటే వారి ఆర్థిక స్థితి, ఆత్మనిర్భరత కచ్చితంగా ఉండాలి. లేదంటే మద్దతు ఇవ్వదని బ్రిటన్ చెబుతోంది. “మేము సహాయం చేస్తాం కానీ మోసం సహించం,” అన్నట్టుగా బ్రిటన్ కొత్త పాలసీ కనిపిస్తోంది.